ప్రతి పదం లో జీవముంది.
ముఖ్యన్గా పేదరికం కంటే, పెద్ద రోగం ఏది వుంది? అన్న వాక్యాలు గుండెల్ని పిండేసాయి.
బస్సు వద్దు, రైలు వద్దు, విడిసి పెడితే నడిసి నేను పోత సారూ.
అబ్బ కట్టి కుదిపేసింది ప్రతి అక్షరం.
నిజమైన హృదయ ఘోష.
జానపదాలు ఆకట్టు కుంటాయి మనసుల్ని. కానీ ఆ పేరుతో నా నా చెత్త వస్తున్న ఈ రోజుల్లో ఇది ఆణి ముత్యం.
ఇది ఎవర్ని ఆకట్టుకోవడానికి వ్రాసింది కాదు కాబట్టి దీనికి ఆ శక్తి.
గొంతు ఎవరిదో గానీ ఇళయరాజా రాజ గాత్రానికి దగ్గరగా వుంది.
దీని రచన ఎవరో?
ఆ పేరు తెలియని కళా కారులు అందరికీ వందనాలు, వారికి పాదాభివందనాలు.
ప్రజానాట్యమండలి వారి 'అక్కో అక్కో నీ తమ్ములమొచ్చినామక్క ' అన్న పాట విని కూడా ఇలాగే కొన్ని రోజుల పాటు దిగ్భ్రమ కి గురి అయి వుండినాను.
మీ
రాయపెద్ది వివేకానంద్
No comments:
Post a Comment